Saturday, June 14, 2014

రావిపాటి వారు

రచన గావించె మెప్పుగ రావి పాటి
పద్యమొక్కటే యర్ధముల్ హృద్య ముగను
భార తంబును రామాయ ణా ర్ధము లవి
యెంత నేర్పది ? పొగడగ సుంత యైన
జాల  నేనార్య !నతులను జాల సేతు

పద్య మొకటిగా గనబడు దధ్య మదియ
చదివి జూడగ రెండుగో  చరమగు మఱి
తేట గీతియు గాదేని యాటవెలది
రెంటి లోనన నొకటిగా గంట బడును

దినము నకునొక పద్యము దెలుపు చుండు
నయ్య వారగు  మాశంక  రయ్య !గురువు
గారికి మఱి సేతు నతులను  గార వంబు
తోడ సుబ్బరా వనునేను  తుషితు నగుచు

అన్ని పదముల కర్ధము నరయు కొఱకు
ఆంధ్ర భారతి జూడంగ నవసరంబు
కలుగు దప్పక మనకిట కవులు లార !
కలిగి యుండుడు బొత్తము గరము నందు

పద్య మంతయు గాకుండ మధ్య లోన
విడిగ నున్నట్టి పద్యము వెలికి తీసి
మనకు జూపిన ధీశాలి మనగు రువులె
వంద నంబులు వారికి వంద లాది

పద్య మంతయు దెలుపును  హృద్యముగను
రామ కధ యను  బేరన  రామ బలము
భాగ మందున నీకధ  భారతంబు
భళిర యనిపించె రెండింటి  భావములును .

నారి కేళ పా  కంబున నానుకతన
కష్ట మనిపించె నర్ధము  కాని యందు
పద్య మొక్కటి చదివిన విందు గూర్చు
సార మట్లుగ నుండుట జవుల తోడ

కఠి న  పదముల కర్ధమ్ము గనుగొ నంగ
రెండు పద్యాల యడుగున నిండు గాను
సులభ ముగనర్ధ మగునట్లు సొంపు మీర
నీయ బడె నార్య !వివరణ యితని చేత
 

No comments:

Post a Comment