Tuesday, August 18, 2015

పద్య రచన -నిధుల దుర్వినియోగము

ప్రభుత యిచ్చును నిధులను బ్రజల కొఱకు
నంచె  నంచెలు  గాగను ,నదియ వచ్చు 
బడుగు  ప్రజలకు పిసరంత  భాగముగను 
గొల్ల కొట్టుదు రధి కారు లెల్ల నిధిని

నిధుల రాకను జూడుమా  నీరజాక్షి !
ప్రభుత నుండి యమాత్యుల  వారి  కచట
నుండి యధ్యక్షు నకునట నుండి యాక
మీ షన రువారి  కటనుండి ,మిగులు సొమ్ము
బడుగు ప్రజలకు  గోరంత  వచ్చు నమ్మ !

No comments:

Post a Comment