Sunday, January 23, 2022

నేతాజీ సుభాష్ చంద్రబోస్


ఆ.వె:భరత దేశమందు బానిసలుగ ప్రజ

        బ్రతుకు చుండ గాంచి బాధతోడ

      పోరు వల్ల మనము పొందగలము స్వేచ్ఛ

       ననుచు బోసు చాటె నవని యందు



ఆ.వె:వైరి జనుల కెల్ల వణుకు పుట్టెను నాడు

       బోసు బాబు యున్న బుగులు హెచ్చె

       శాంతి మాట కన్న సాయుధ సమరమే

       సక్రమంబ టంచు సాగె ముందు


ఆ.వె:భరత మాత వెతను  బాపదలచువారు

     పోరు చేయు నెంచ పుడమియందు

     ననుచు జనుల పిలిచె  నాయజాదుఫవుజు

     సైన్యమందు చేర జవము గాను


ఆ.వె: తెల్లవారినింక దేశమునుండియే

   తరుమ వలెనటంచు తలచి కూర్చె

     సైన్యము నొకచోట సాయుధ పోరాట

      మాచ రించ నెంచి నవనియందు


ఆ.వె:దేశమాత యొక్క దీనత్వమును బాప 

       సైన్యమిలను కూర్చి చక్కగా ను

      సమర మాచ రించ సాగుచు నేతాజి

     గగనవీధి యందె కన్ను మూసె.


డా బల్లూరి ఉమాదేవి