Tuesday, June 7, 2011

రాష్ట్ర పతులు

1. DR Rajendra prasad =26-1-1950 to 13-5-1962
2.sarvepalli Radha krishnan=13-5-1962 to 13-5-1967
3.jakeer hussain=13-5-1967 to 3-5-1969
4.varahagiri venkatagiri=3-5-1969 to 20-7-1969
24-8-1969 to 24-8-1974
5.fakrudden aali ahammad-29-8-1974 to 11-2-1977
6.neelam sanjeeva reddy=25-7-1977 to 25-7-1982
7.jnani jail singh=25-7-1982 to 25-7-1987
8.R vekataraman=25-7-1987 to 25-7 1992
9.shankar dayal sharma=25-7-1992 to 25-7-1997
10.kr narayan=25-7-1977 to 25-7-2002
11.AJ abdul kalam=25-7-2002 to 25-7-2007

దానము -ధర్మము

దానము -ఇచ్చెడి వస్తువునందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .
ధర్మము -ప్రజోప యోగార్ధమై చేయప్పనులు

మహా యజ్ఞములు

.దేవ యజ్ఞము -గృహస్తులు దేవతల నుద్దేశించి చేయు యజ్ఞము
.పితృ యజ్ఞము -తల్లి దండ్రులు లేని వారు చ్చేయు యజ్ఞము
.భూత యజ్ఞము -భూత దయ కలవారు చేయు యజ్ఞము
.మనుష్య యజ్ఞము -అతిధి ,అభ్యాగతులకు చేయు యజ్ఞము
.బ్రహ్మ యజ్ఞము -వేదాధ్యయనము చేయు వారు చేయు యజ్ఞము

Monday, June 6, 2011

గ్రహములు -రత్నములు

.సూర్యుడు -కెంపులు
.చంద్రుడు -ముత్యము
.అంగారకుడు -పగడము
.బుధుడు -ఆకుపచ్చ
.గురుడు-పుష్యరాగము
.శుక్రుడు -వజ్రము
.శని-న్నీలము
.రాహువు -గోమేధికము
.కేతువు -వైడుర్యము

Friday, June 18, 2010

ఆ  పస్తంబ కల్ప వృక్షము

విద్యా వాచస్పతి ,వేద శ్రీ ,విద్వత్ శిరోమణి
బ్రహ్మ శ్రీ తెలకపల్లె విశ్వనాధ శర్మ
-----------------------------------------------------------------------------------------

శకారాతి శాలి వాహనుని శకము ప్రారంభ మగుటకు పూ ర్వమే విక్రమార్కుడు తన సంవత్సరమును ప్రవర్తింప చేసెను .ఆయన తమ్ముడు భర్తృహరి నీతి, శృంగార ,వైరాగ్య శతకములు అని ప్రపంచ ప్రఖ్యాతములైన ౩ శతక సాహిత్యములను అద్భుతముగా సృష్టించెను . ఆయనకు పూర్వము ౧౫౦౦ సంవత్సరముల నాడు కాత్యాయన మహర్షి శివ మహిమ్న స్తోత్రమును రచించెను .ఇది కవుల పరంపర .ఈ నీ తి, శతక స్తోత్రములు పురాణము లలో అనాదిగా ఉన్నట్టు కనపడు చున్నవి . తెలుగు భాష లో ప్రఖ్యాత మైన సుమతి శతకము అను నీ తి శతకము శాశ్వత మైన గరుడ పురాణము లోని బృహస్పతి ప్రవచించిన సంస్కృత నీ తి శతకమునకు తూ చ తప్పని అనువాదమే . ఇట్లు ఈ నీ తి ,స్తోత్ర శతక సంప్రదాయ ము మన దేశములో అనాదిగా కొనసాగుచు వచ్చు చున్నది .

మహారాజ శ్రీ సుబ్బారావు మహా కవి కలము నుండి జాలు వారినవే ఈ రెండు విధముల కవనములు . ఇంతటి పాశ్చాత్య ప్రభావోపేతమైన ఘోర కలిలో కూడ ఈ పరంపర అవిచ్చిన్నముగా సాగిపోవు చుండుట ఆనంద దాయక మైన విషయము . భవిష్యత్తు లో కూడ దీనిని బట్టి ఈ విధమైన కవితా ప్రవాహములు ఆగవని అని పించు చున్నవి .

ఈ కవి ప్రధానముగా హనుమద్భ క్తు డైనను ఆ హనుమంతుడు రామ భక్తుడు కనుక సర్వ జన వంద నీ యుడు అను భావమును బలముగా ధ్వనింప జేయుచు రామ భక్త అను మకుటమును తన పద్యములకు ఒసంగెను .శీ ఘ్రముగా ప్రసన్ను డయ్యె ఆంజనేయ స్వామికి ఎన్నో నామములున్నను హనుమంతుడు అను పదము ముఖ్య మైనది . హనుమంతుడు అనగా హనువు = దవడ కలవాడు =హనుమంతుడు . మన అందరికి దవడ ఉన్నది కదా .మనము హనుమంతులమేనా ? కాము . సంస్కృత శబ్దముల సంప్రదాయములో ఒక అద్భుత విలాసము లుండును . స్త్రీని అంగన అందురు .అంగన అనగా అంగములు కలది అని అర్ధము . మఱి పురుషుడు కూడ అంగములు ఉండును కనుక అంగనులు అందురా ? కారు .ప్రశస్తములైన అంగములు కలవి అని అర్ధము . అట్లే హనువు (దవడ ) కలవాడు . అనగా వజ్రాయుధ ఘాతముచే దవడ వాచిన వాడు అని అర్ధము కాదు . ప్రశస్తమైన హనువు కలవాడు అని భావము . ఆయన హనువుకు ప్రాశస్త్యము ఎట్లు వచ్చెను అనగా వైకుంతు పొగడని వక్త్రంబు వక్త్రమే ,డమ డమ ధ్వని తోడి డక్క కాక అన్నట్లు ఆ మహాను భావుడు తన హనువును అవిచ్చిన్న రామ నామ జపమునకై వినియోగించు చున్నాడు . అందువలన రామ భక్తుని హనువు ప్రశస్తమైనది . కనుక ఆయన ప్రశస్త హనుమంతుడు అని భావము .

మనము మన హనువును పర దూష ణము ,గురు దూ ష ణముకో, అసత్యములు చెప్పుటకో, చాడీలు చెప్పుటకో ఉపయోగించు చున్నాము . అందువలన మన హనువు అప్రశ స్తమైనది . కనుక మనము హనుమంతులము కాము ఈ విషయము లన్నియు వారు తమ కవిత్వములో ధ్వనింప జేసిరి .కనుక ధ్వనించే అర్ధమునకు బలము ఎక్కువ . కనుక వీ రు కవితా సిద్దులని అనుకో వలసి వచ్చును .

తర్వాత నీ తి శతకమును సుమతి శతకము యొక్క ఒరవడి పై కందములలో నరుడా ! అను మకుటముతో రచించిరి .ఇది కూడ గొప్ప సుగుణమే.నీవు నరుడవు .ఈ నీ తులకు తప్పినచో నరకుడ వగుదువు .నరకుడవు అయన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు కొన్నట్లు ఈ నీ తులు ఏమియు ఉపయోగించవని భావము .

ఈ కవి లేఖిని నుండి ఇతోదికముగా పుంఖాను పుంఖములుగా నీ తి ,భక్తి పద్యములు వెలువడ గలవని ఆశించు చున్నాను .

(సం )
తె.వి.శర్మ
(తెలకపల్లె విశ్వనాధ శర్మ )
ఫోన్ .౦౪౦౨౪౦౩౩౩౨౬

కలియుగాబ్దములు ౫౧౧౧
వికృతి జ్యేష్ట శుద్ధ తదియ
౧౫-౬-౨౦౧౦

అభినందన వాక్యము

ఓం నమో భగవతే శ్రీ విద్యా ర ణ్యా య !
సాహితీ సమాలోచనం ద్వారా సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది .అది సమాజంలో చైతన్య వికాసానికి దోహదం చేస్తుంది .మన తెలుగు భాషకు సాహిత్యం ,ఆ సాహిత్యం లొ లాలిత్యము ,లాలిత్యముతో బాటు ప్రగాఢ భక్తి ,సంస్కారము ఉన్నాయి .నిజమే . ఏ భాషలో లేవు గనుక .ఏ సంస్కృతిలో గాన రావు గనుక .కాని ఎందుకో గాని తెలుగు వాడికి తన జాతి ,సంస్కృతీ , భాష అంటే అమితానందము .కార ణం ఆ సంస్కృతిలో ,భాషలో ,సాహిత్యంలో భక్తి ,జ్ఞానం ,వైరాగ్యం ఉట్టి పడతా యి.

హనుమ పేరు తలుస్తూనే తెలుగు వాడి హృదయం భక్తితో ఉప్పొంగి పోతుంది .దేశం లో హనుమద్ భక్తులు ,నిరతిశయా నందంతో ఊ గి పోతారు .ఆ భక్త శిఖా మ ణు ల కోవకు చెందినవారు మాన్య శ్రీ సుబ్బారావు గారు .

నిజానికి తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని చొప్పించిన గొప్ప కవితా శిఖా మ ణులు.ఒక్క పొల్లు మాటను కూడ వాడ కుండ మర్రి విత్తన మంత చిన్ని పద్యములలో మహా వృక్ష మంత భావాన్ని అందించారు .అదే సాహితీ వేత్తల మధుర గీతము .ఆ గీతమును పాడుకొంటూ ఆ హనుమను తన మనస్సునందే యుండమని శతక పద్యములతో బంధించి వేశారు శ్రీ సుబ్బారావు గారు . భక్తుడు కోరేదే అది .భగవంతుని భక్తితో బంధింస్తే భవ బంధాలు వాటంతట అవే ఊ డిపోతాయి.
చిత్త శుద్ధిగ చేసెద సేవ నీ కు
ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
పారమార్ధికమునకు నే బాటు పడను
నా మనంబున నుండుమా రామ భక్త !
వాసనానాం పరిత్యజ మొక్షార్ధిత్వ మపి త్యజ అను నది ఉపనిషద్వా ణి.
అంత పెద్ద అర్ధం కాని ఉపనిషద్వా ణి ని చిన్న పద్యం లో చిన్ని చిన్ని పదములలో ఇ రికించారు శ్రీ సుబ్బారావు కవీన్ద్రులు .ఇట్లాంటివి ఎన్నో ,ఎన్నెన్నో .
ఇక సాహిత్య సేవా దృక్పధంలో -సమాస వికాస మునకు మార్గగామి శ్రీ సుబ్బారావు .మచ్చు తునక లాంటి -మంచి కంద పద్య సౌరభాలను సమాజము మీదికి వెదజల్లినారు.

మానుము ననుమానమ్మును
మానుము మఱి దుష్ట జనుల మైత్రిని పుడమిన్
మానుము చెడు నలవాట్లను
మానుము నిక చెడ్డ పనుల మహిలో నరుడా !
ఇట్లా చెప్పినవే -ఓ వంద కందాలు .విందా ర గిన్చండని వందనముతో డ పలికిన రమ్య మైన సాహి తీ సుధా పరంపర .
తన అమెరికా పర్యటనలో ఆ దేశ ఆనందాన్ని చవి చూచి పలవ రింపుతో పలుకరించిన పద్య సుమాలు ఆహ్లాదము కలిగిస్తాయి .
మా తృ మూర్తిని మన్నించమని ,దైవ సాన్నిధ్యమే తనకు రక్ష యని , ప్రేమ మూర్తి శ్రీ శ్రీ శ్రీ బాబా గారిని తనను కనిక రించమని వేడుకొనే పద్యాలు .కాదు అవి అమృత బిందువులు .

శ్రీ సుబ్బారావు గారిని వారి సాహితి సేవను మరువలేరు అనడానికి ఈ చిన్న పద్యాలే నిదర్శనములు .
శుభాభి నందనలతో ------వ . వేం. సత్యనారాయణ
౫-౫-౨౦౧౦. ph.no.o4024037759
saraswata visarada ,vedanta siromani,daivajna ratna
Rtd.dy.scy to govt&ex member
aagama examinationsadvisory board
ap,state govt,Endoments Department
AlsoGuest facuity dr MCr HRd institute of A.P.
H.no.4-53,New Nagole colony,saroor nagar,hyd-500035.





Friday, May 7, 2010

హరి విల్లు-----షష్టి పూర్తీ

పూ జ్యులు పేరరాజు -సత్య సుందరులు
ఆ పురాణ దంపతుల జ్యేష్ట పుత్రుడ !
నాన్న ఓ నాన్న
సామాన్య కుటుంబాన జన్మించి
తెనుగు పండిట్టువై
వేల సంఖ్యల శి ష్యుల మన్ననల నందినావు
మేమునూ నీ శిష్య పరమా ణు లమే
అయినందులకు గర్వించు చున్నాము
అమ్మా ! నాన్న !
ఆది దంపతులు మాకు మీరు
మీ కనుసన్నల మెలగు చుంటిమి
మీ ఆజ్నలే మాకు శి రోదార్యములు
షష్టి .....షష్టి పూర్తి
నిండెనా అరువది వత్సరములు
కలగా ఉన్నది నాన్న !
నీ వయసును చూ స్తే
పవలు రేలు శ్ర మించినా
అలుపు సొలుపులు నిన్ను అంటవు
ఏ మి కోరవు ఏ మి వేడవు
నీవు మా పుణ్యాల పంటవు
మా కోసమె నీ జీవితమంతా
ధార వోసితివి, ఇది నిజము సుమ్ము
నీకుగా నీకు ఏమియు లేదు
నిరాడంబర జీవితము తక్క
బ్రతుకు నందలి మిట్ట పల్లము
లన్నియు నీకు సమానములే
దుఖమునకు క్రుంగి పోవుట
సుఖమునకు పొంగి పోవుటలు
నీకు సుదూరములు........
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎత్తు లేవీ లేనివాడవు
దైవ చింతన దైవ దర్శనములు
నీకు నిత్య కృత్యములు
ఈ షష్టి పూర్తి పర్వ దినాన
మా నమస్కృతు లందు కోవలె
శత వసంతము లీవు మనవలె
మీకివే మా శత కోటి వందనములు ...
ప్రేమతో ....
కిరణ్
పాపాయి
మాధవి