Wednesday, October 22, 2014

అంశం- దీపావళి. ఛందస్సు- ఉత్పలమాల. మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’, మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’. (పదవ అక్షరం గురువు కావాలి. అంటే ‘వ’ తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)

దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా
పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్
పాపిని భూసుతున్ దునుమి చ్చిన కృష్ణుని సత్యభామనే
కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే.

No comments:

Post a Comment